ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యకరమైన చిట్కాలని పాటిస్తూ ఉంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు.

నరాల బలహీనత సమస్యతో కూడా, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. నరాల బలహీనత అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్య ఉంటే కాళ్లు చేతులు వణికిపోవడం, మాట్లాడే క్రమంలో కళ్ళ నుండి నీళ్లు కారడం,

ఎప్పుడైనా అనుకొని సంఘటనని చూసినా, విన్నా గుండె దడ రావడం,బరువు లేని వస్తువుల్ని మోయడం కూడా కష్టంగా అనిపించడం, ఇలా ఈ సమస్య ఉన్న వాళ్ళలో కలుగుతూ ఉంటాయి. ఏమైనా రాయాలంటే కూడా చేతులు వణికిపోతూ ఉంటాయి. ఇలా, పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక తొందరగా అలిసిపోతుంటారు.

వయసు పెరిగే కొద్దీ నరాల బలహీనత సమస్య వస్తూ ఉంటుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే, ఈ సమస్య నుండి బయట పడిపోవచ్చు. సాధారణంగా నరాల బలహీనత రాగానే, చాలామంది టాబ్లెట్లు లేదంటే రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఇంట్లోనే ఇలా మనం ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు. ఈ పొడిని తీసుకుంటే,

ఈ సమస్య తగ్గిపోతుంది. ఒక మిక్సీ జార్లో ఐదు స్పూన్లు పుచ్చకాయ గింజలు వేయండి. అలానే ఐదు స్పూన్లు అవిసె గింజల్ని వేయండి. రెండు బిర్యాని ఆకుల్ని వేసేయండి. దాల్చిన చెక్క, మిరియాలు, 10 వాల్నట్స్, 3 చిన్న పటిక బెల్లం ముక్కలు వేసుకోండి. మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని ఫ్రిజ్లో పెట్టుకుంటే, 15 రోజులు వరకు నిల్వ ఉంటుంది. పాడైపోదు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదంటే నీళ్లల్లో అర స్పూన్ పొడి కలిపి తాగితే సరిపోతుంది. నరాల బలహీనత ఈజీగా తగ్గిపోతుంది.