ప్రస్తుతం ఉన్న కాలుష్యపు సమాజంలో మనకు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు లేకపోయినా, పరోక్ష ప్రభావం, వాహనాల కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు సంబందించిన సమస్యలు వేధిస్తుంటాయి. ఊరితిత్తులు కలుషితం అయిపోవడం వల్ల మన శరీరంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వీటన్నిటికి కేవలం ఒకే ఒక్క గొప్ప డ్రింక్ తో చెక్ పెట్టవచ్చు. కేవలం ఈ డ్రింక్ ను 20 రోజుల పాటు విడవకుండా తాగడం వల్ల కలుషితమైపోయిన ఊపిరితిత్తులను శుభ్రపరుచుకోవచ్చు. అయితే ఆ డ్రింక్ కు కావల్సిన పదార్థాలు ఏంటి?? ఎలా తయారు చేసుకోవాలి చూడండి మరి.

కావలసిన పదార్థాలు:
ఒక గ్లాస్ నీళ్లు, పుదీనా ఆకులు రెండు లేక మూడు, అంగుళం అల్లం లేక అరటీస్పూన్ అల్లం పౌడర్, ఒకటి లేదా రెండు యాలక్కాయలు, మిరియాలు రెండు లేదా మూడు, నిమ్మకాయ అరచెక్క, తేనె ఒక టేబుల్ స్పూన్.

తయారు విధానం:
ముందుగా గ్లాసుడు నీళ్లలో ఒక ఆగిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి కాగనివ్వాలి.నీళ్లు మర్లుతున్నపుడు అందులో పుధీన ఆకులు, అల్లం పౌడర్ లేక అంగుళం అల్లాన్ని బాగా దంచి నీళ్లలో వేయాలి, అదే విధంగా యాలక్కాయలు, మిరియాలు కూడా దంచి వేయాలి. రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా మరిగించిన తరువాత దించి చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నపుడు అందులో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి.

దీన్ని భోజనం చేయడానికి లేదా ఏదైనా ఆహారం తీసుకోవడానికి 10 నుండి 20 నిమిషాల ముందు తాగాలి..మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.