అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నివారణ చర్యలు పాటించి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..సనాతన హిందూ సంప్ర దాయంలో లక్ష్మీ దేవి సంపదకు దేవతగా భావిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల, ఆర్థిక సమస్యలు తీరిపోతాయని నమ్మకం.

అంతేకాదు కుబేరుడు, శుక్రుడు కూడా ఎవరిపై అనుగ్రహం కలిగి ఉంటారో, వారికీ ఎప్పడూ ఆర్ధిక ఇబ్బందులు కలగవని విశ్వాసం. కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే ధన ధాన్యాలకు ఇబ్బంది కలగదని విశ్వాసం. డబ్బు సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..

అప్పు ఇచ్చి న డబ్బును తిరిగి పొందడం ఎలా :- పేదలకు మిఠాయిలు ఇంకా బట్టలు ఇవ్వండి . ప్రతి రోజూ పాలు, నీరు కలిపి చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఆ తర్వాత తమ డబ్బుల కోసం, ఆర్ధికంగా ఇబ్బందులు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి.

ఆదాయ మార్గాలు, పెంచుకునే విధానం :- ప్రతి రోజూ రావి చెట్టుకు పూజ చేయండి. నీరు సమర్పించి, మిఠాయిని నైవేద్యంగా సమర్పించండి. అనంతరం రావి చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయండి. అనంతరం ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగం, డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోయి ఆదయ మార్గాలు లభిస్తాయని విశ్వాసం.

సంపద పెరగడం కోసం:- శుక్రవారం రోజున లక్ష్మి దేవికి గులాబీ పూల దండలు సమర్పించి ,ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి, లక్ష్మీ దేవికి హారతి ఇవ్వాలి . ఈ రోజున స్త్రీలకు తెల్లని స్వీట్లను దానం చేయండి. ఈ నివారణ చర్యలతో మన పూర్వీకుల ఆస్తిని, పొందే అవకాశం ఉందని నమ్మకం.రుణ సమస్యల నుండి విముక్తి – అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, శుక్రవారం వేప చెట్టుని పూజించండి. శక్తి మేరకు ఆకలి అన్నవారికి అన్నప్రసాదం ఇవ్వండి .