ఈరోజుల్లో చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు కంటి సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. చిన్నపిల్లలైనా.. పెద్దవాళ్ళైనా కళ్ళను సెల్ ఫోన్లు,లాప్టాప్ లకు టీవీలకు ఈ మూడింటికి కచ్చితంగా అప్పగించేస్తున్నారు.

పైగా చాలా మందికి ఈ రోజుల్లో నిద్ర కూడా సరిపడా ఉండటం లేదు. చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో కూడా కంటి చూపు చాలామంది కోల్పోవడం లేదా మసకబారడం చిన్న వయసులోనే కంటి అద్దాలతో ఇబ్బంది పడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం.

ఇలా ఇప్పటికే కంటి చూపు కోల్పోతున్న వాళ్ళయినా లేదా ఇప్పటికే కళ్ళజోడు ఉన్న వాళ్ళైనా..బిర్యానీ ఆకులు ఒక నాలుగు ఐదు వరకు తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు వేసి చక్కగా మరిగించండి. అంటే మీరు వేసిన వాటర్ త్రి ఫోర్త్ వరకు గాని హాఫ్ వరకు అయ్యేగాని బాగా మరిగించండి. ఇలా మరిగిన తర్వాత వడకట్టుకుని తాగితే కంటి సంబంధిత సమస్యలు చాలా వరకు నయమవుతాయి.

అంటే దృష్టిలోపం ఉన్నవాళ్ళకి దృష్టి చక్కగా వస్తుంది. అంతే కాకుండా ఏమైనా ఇంకా ఇతరత్రా కంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వాటర్ రెగ్యులర్గా తాగడం వల్ల ఆ సమస్యలు కూడా పోతాయి. ఈ ఆకుల్లో ముఖ్యంగా ఏ,సి బి6 లాంటి విటమిన్ ఉంటాయి. ఐరన్, పొటాషియం మాంగనీస్, డైటరీ ఫైబర్లు ఉంటాయి.ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. రోజు వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా అరిగిపోతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ మెరుగవుతుంది.