తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా అగ్ర నటులుగా కొన్ని దశాబ్దాల నుండి కొనసాగుతున్నారు. కొంతమంది సినీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన కూడా తమ తమ ప్రత్యేకమైన టాలెంట్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని అగ్ర నటులుగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ కొంతమంది హీరోలు సినీ బ్యాక్ గ్రౌండ్వ నుండి వచ్చి కెరీర్ ప్రారంభంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ తర్వాత ఆకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. వారిలో ఒకరు వడ్డే నవీన్. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు అయిన వడ్డే నవీన్ ఆయన కోరుకున్న ప్రియుడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు.

ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా వడ్డే నవీన్కి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్లో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న తొలి చిత్రం పెళ్లి. ఈ సినిమా ద్వారా ఆయన తన కెరీర్ లోని భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన అనతికాలంలోనే మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించేమనసు, మరియు చాలా బాగుంది వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో హీరోగా నటించి అతి తక్కువ సమయంలోనే గొప్ప స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. కానీ తన కంటూ ఒక మార్క్ ను సృష్టించుకున్న వద్దే నవీన్ దానిని కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఎంత తొందరగా మన కళ్ళ ముందు పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడో అంతే తొందరగా కెరీర్ పరంగా డౌన్ అయ్యాడు.

సుమారు 28 సినిమాల్లో హీరోగా నటించిన ఈయన, హీరోగా తన కెరీర్ ముగియడంతో ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రెండు మూడు సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా రాణిస్తున్నటు ఎందుకో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించలేకపోయాడు. ఇది ఇలా ఉండగా ఇక వడ్డీ నవీన్ వ్యక్తిగత విషయాల్లో కి వెళ్తే ఆయన పెళ్లాడిన అమ్మాయి ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇక అసలు విషయానికి వస్తే వడ్డే నవీన్, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారుడు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లాడాడు. వడ్డే నవీన్ తండ్రి రమేష్ కి, రామారావు గారి కుటుంబానికి తొలి నుండి మంచి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఈ పెళ్లి కుదిరింది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ పెళ్లి అయిన కొంతకాలానికి విడిపోవాల్సి వచ్చింది.

ఈ ప్రభావం వడ్డీ నవీన్ కెరీర్ మీద పడింది అని కొంతమంది అంటుంటారు.కానీ అది నిజం కాదు అని వాటిని అప్పట్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విలేఖరికి సమాధానమిచ్చాడు. చాముండేశ్వరి తో విడాకులు అయిపోయిన తర్వాత వడ్డే నవీన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సుఖంగా సాగిస్తున్నారు. ఆయన వెండితెర మీద ఆఖరుగా కనిపించిన సినిమా 2016 లో రాంగోపాల్ వర్మ మరియు మంచు మనోజ్ ఎటాక్ సినిమా. ఈ సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమాలో నటించలేదు. ఇక శాశ్వతంగా సినిమాలకు దూరం అయిపోయాడు. ఇదండీ వడ్డే నవీన్ గారి స్టోరీ.