రేషన్ కార్డు ఈ కేవైసీ ఇంకా చేసుకోలేదా.. అయితే వెంటనే మీ రేషన్ దుకాణం వద్దకు వెళ్లి మీరు రేషన్ కార్డు ని ఈ కేవైసీ చేసుకోండి..లేకపోతే మీకు ఇక రేషన్ సరుకులు రాక పోవచ్చు..

ఈ కేవైసీ డెడ్లైన్ ప్రక్రియ ప్రభుత్వం విధించింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ కి జనవరి 31 గడువు అని స్పష్టం చేస్తుంది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ సోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈలోపు ఎవరైనా ఆధార్ లింకు చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డులను తొలగించాలని ఉద్దేశంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ ఈ కేవైసీ కార్యక్రమాన్నీ చేపట్టింది.గత తొమ్మిదేళ్లలో ఎంతోమంది చనిపోగా..

మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు… ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పేరు ఈ కేవైసీ చేపట్టింది. ప్రస్తుతం రేషన్ కార్డులో పేరు ఉన్న వారు అంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేస్తుంది. రెండు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసి చేసుకుంటున్నారు.

ఈ కేవైసీ కోసం వేలిముద్రలు ఆధార్ ధ్రువీకరణ వంటి గుర్తింపులు తీసుకుంటున్నారు. రేషన్ కార్డును ఆధార్ నెంబర్తో లింకు చేయడానికి మీ రేషన్ కార్డులు ఉన్నా సభ్యులందరి ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ కేవైసీను పూర్తి చేస్తారు..ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు. తాజాగా ఆ గడువును జనవరి 31 వరకు పొడిగించారు. తెలంగాణలో రేషన్ ఈ కేవైసీ ఇప్పటికే సుమారు 70% ప్రక్రియ పూర్తయింది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…