ప్రముఖ శిల్పి అరుణ్యోగి రాజ్ తాజాగా అయోధ్యలోని రామ మందిరంలో, ప్రతిష్టించిన రామ్ లాలా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నారు.

తాను రూపొందిస్తున్న సమయంలో రాముడు విగ్రహం ఒకరకంగా ఉందని, ప్రతిష్టాపన తర్వాత మరోరకంగా కనిపించిందని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట తర్వాత శ్రీరాముడి మరో రూపాన్ని సంతరించుకున్నాడని తెలిపాడు. అయితే ఏడు నెలల పాటు రూపొందించాడు ప్రతిష్టాపన తర్వాత అదే రామ్లాలను గుర్తించలేకపోయాను, అంటూ శిల్పి పేర్కొన్నారు.

గర్భగుడిలోకి అడుగుపెట్టగానే రామ్లాలలో చాలా మార్పు కనిపించాయట, ఆ విగ్రహంలోని ప్రకాశం మరోలా ఉందని చెప్పుకు వచ్చాడు. రామ మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్టించిన తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడు, రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు తనకు ఒకరకంగానూ, ప్రాణ ప్రతిష్ట తర్వాత మరో రకంగా కనిపించాడు అంటూ పేర్కొన్నాడు. ఇది చూసి తాను సంబరం ఆశ్చర్యాలకు గురయ్యాను అన్నారు. ఇది తన పని కాదని తాను భావించానని వాపోయాడు,

ఇక ఆ ఈశ్వరుడి చమత్కారము లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ, ఇది నిజంగా అద్భుతం అంటూ అరుణ్యోగి రాజ్ పేర్కొన్నాడు. ఎన్నో ఏళ్లుగా పూర్వీకుల తపస్సు ఫలితమే తాను ఈ పనికి ఎంపిక అయ్యానని, తన భావాలను తన మాటల్లో వర్ణించలేనిది అన్నాడు. రామ్లల్ల విగ్రహాన్ని తయారు చేసేందుకు తనకు ఏడు నెలల సమయం పట్టిందన్నాడు, ఆ ఏడు నెలల సమయం తనకి ఒక ఛాలెంజ్గా అనిపించిందని చెప్పుకోవచ్చరు. అయితే ఇదే సమయంలో అరుణ్యోగి రాజ్ ఆసక్తికరమైన కథను కూడా పంచుకున్నారు,

తాను రాంలల్ల విగ్రహాన్ని రూపొందించే సమయంలో కోతులు ఎక్కువగా వచ్చేవని, అప్పుడు పనిని కొనసాగించడం కాస్త ఇబ్బందిగా ఉండేదని చెప్పకు వచ్చారు. ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం తాము ద్వారాలు ఫిక్స్ చేశామని, అయినప్పటికీ కూడా ఆ కోతులు తమని విడిచిపెట్టలేదని అన్నారు. అది అక్కడికి వచ్చి తలుపులు కొట్టేవని చెప్పారు, తాము తలుపులు తెరిచే దాకా అవి కొడుతూనే ఉండేవి అన్నారు. చివరికి తాను తలుపులు తీస్తే అది విగ్రహాన్ని చూసి మళ్ళీ వెళ్ళిపోయేవి అన్నారు. డిసెంబర్ 29వ తేదీన ప్రాణ ప్రతిష్టకు తన విగ్రహాన్ని ఫైనల్ చేశారని, దాంతో తాను తుది మెరుగులు దిద్ది అనుకున్న సమయానికి పని పూర్తి చేశానని వెల్లడించారు అరుణ్.