మరణించిన వారు మన కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం, మన బంధువులు మిత్రులు రక్తసంబంధీకులు మరణిస్తే, వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో, మన కలలోకి వచ్చే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా.

ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి. ఒకవేళ మీకే గనుక ఇలాంటి కలలు వస్తే, వాటి గురించి భయపడవలసిన అవసరమే లేదు. హిందూ ధర్మ శాస్త్రాలలో ఏ కలల గురించిన ఒక శాస్త్రవే ఉంది అదే స్వప్న శాస్త్రం. ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది.

ఈరోజు మనం మరణించిన వారు, మన కలలో కనపడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్వప్న శాస్త్రంలో ప్రతి శాస్త్రానికి ఒక విశేషం ఉంటుంది. అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే,

అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే, ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది. ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని, దాని అర్థం ఇలాంటి కలలు కనక మీకు వస్తే ,ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ముందుకు సాగిపోవాలి.

ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మృత్యువు సంభవిస్తే, అతను మీ కలలో అనారోగ్యంతో కనపడితే దాని అర్థం. ఆ మరణించిన వ్యక్తి మీతో, తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం. దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ కాలం మరణం సంభవించడం వలన ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉంటుంది. దానిని అతను పూర్తి చేయాలనుకున్నాడు, కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు. ఒకవేళ మీకే గనుక అతని కోరిక గురించి ముందే తెలిస్తే, దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.