రేపే భోగి ఆదివారం భోగభాగ్యాలను అందించే రోజు, పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో, మొదటి పండుగను మనం భోగిగా జరుపుకుంటూ ఉంటాము.

ఈరోజు భోగిమంటలు వేసుకుంటారు, దక్షిణాయంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా, కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వడం వలన, భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలిమంటలు వేసుకునేవారు.

ఉత్తరాయణం ముందు రోజుకే చాలా విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తామపడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ, వేసే మంటలను భోగిమంటలు అంటారు. సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది,

భోగం అంటే సుఖం శ్రీ రంగనాథ స్వామీ లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చింది. అనేది మన పురాణాల గాధ.శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాధ మనందరికీ తెలిసిందే, అయితే తర్వాత విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చే ప్రజలను ఆశీర్వదించమని, వరం ఇవ్వడం జరిగింది బలి చక్రవర్తి రాకను,

ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. భోగి మంటల్లో ఆవుపేడతో చేసిన పిడకలు, ఇంట్లో ఉన్న పాత బట్టలు, పాత చెక్క పాత వస్తువులను వేస్తారు. మనలోనే చెడును తగలబెట్టి మంచి పెంచుకోవడమే, ఈ భోగి మంటల అంతరార్థం ఈ భోగిమంటల్లో పిడకలతో పాటు రాగి, మేడి ఔషధాలు చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదల అవుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.