పుట్టింటికి వెళ్లడం అంటే వివాహిత మహిళలకి ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మహిళ కూడా అంతే సంతోషంగా, భర్తతో కలిసి తన పుట్టింటికి బయలుదేరింది. మరి కాసేపట్లో తన తలగారింట్లో అడుగుపెడతామని సంతోషంగా ఉంది.

ఇంతలో భర్తకి ఫోన్ రావడంతో అతడు బైక్ పక్కకి ఆపి కాల్ మాట్లాడుతున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అప్పటివరకు బానే ఉన్నా మహిళ, ఒక్కసారి దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త కాళ్ళ ఎదుట కళ్ళ ఎదుటే కాలువలోకి దూకే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ దారుణ ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం కి చెందిన శ్రీనివాసరావుకి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కి చెందిన కస్తూరి తో ఏడాది కింద జనవరిలో వివాహం అయ్యింది. ఇక శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాచవరం మండలం వెలివెన్నులోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.

కస్తూరి అత్తింట్లోనే ఉంటుంది, ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో, శుక్రవారం ఉదయం కస్తూరిన ఆమె పుట్టిల్లు కొవ్వూరులో దించేందుకు బైక్ పై బయలుదేరారు. నల్లచెర్ల మండలం అనంత పల్లి లో పోలవరం గుడి బ్రిడ్జి దగ్గరికి వచ్చే సమయానికి కస్తూరి భర్త శ్రీనివాస్ కి ఫోన్ వచ్చింది. దాంతో పక్కనే బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతున్నాడు,

అదే సమయంలో కస్తూరి తన చెప్పు పడిపోయిందని తెచ్చుకుంటానని వెనక్కి వెళ్లి భర్త శ్రీనివాస్ కళ్ళముందే కాలువలో దూకింది. కళ్ళముందే కస్తూరి కొట్టుకుపోతున్న ఆమెను రక్షించేందుకు ఎవరూ ప్రయత్నం చేయలేదు. చాలా సుమారు 500 మీటర్ల వరకు నీళ్లపై కనిపించిన కస్తూరి, ఆ తర్వాత నీటిలో మునిగిపోయింది. గజ ఈతగాల్ల సహాయంతో వెతికినా ఆచూకీ దొరకలేదు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కస్తూరి కోసం గాలిస్తున్నారు. అయితే వాళ్ళ పెళ్లయి ఏడాది కూడా కాలేదని కానీ గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఆమె కాలువలోకి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtu.be/h5_IHz_r5t4