కోలీవుడ్ నటి మహాలక్ష్మి ఒకప్పుడు ఫేమస్ కాలేదు కానీ, ఎప్పుడైతే నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ని వివాహమాడిందో, ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. అంత బరువున్న నిర్మాతను ప్రేమించి ఏది కోరి రెండవ పెళ్లి చేసుకోవడంతో, అందరూ ఆమె ప్రేమను శంకించారు. డబ్బు కోసమే నిర్మాతను వివాహం ఆడిందని చెప్పుకొచ్చారు,

లేకపోతే ప్రేమతో కాదని ఆస్తి నగలు కోసం ప్రేమ పేరుతో రవీందర్ని వలలో వేసుకుందని విమర్శించారు. ఇక ఎవరేమన్నా పట్టించుకోని జంట, ఏడాది పాటు తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపారు. ఏడాదిలో రవిచంద్ర మహాలక్ష్మికి కాస్ట్లి గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ కూడా చేశాడు.

ఇక అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఈ ఏడాది ఒక చీటింగ్ కేసులో రవీందర్ జైలుకు వెళ్ళాడు. భర్త జైల్లో ఉన్నాడు అన్న బాధ లేకుండా, మహాలక్ష్మి సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మహాలక్ష్మి భర్త పై సంచల ఆరోపణలు చేసింది.

రవీందర్ తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సన్నిహితుల ముందు చెప్పుకు వస్తుందని చెప్పుకు వచ్చిందని తెలుస్తోంది. పెళ్లికి ముందు రవీందర్ ఇలాంటి విషయాలు నాకేమీ చెప్పలేదు. చీటింగ్ కేసులో డబ్బు విషయాలు మా మధ్య రాలేదు, నాకు అబద్దాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంటూ తెలిపింది.

దీంతో అభిమానులు ఆమె వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. డబ్బు ఉన్నంతకాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడు అతడు జైల్లో ఉంటే మోసం చేశాడని చెప్పడం భావ్యం కాదని, ఇలా చేస్తే కచ్చితంగా తాను డబ్బు కోసమే పెళ్లి చేస్తుందని అనుకుంటారని చెప్పకు వచ్చారు.ప్రస్తుతం మహాలక్ష్మి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి..