వేసవికాలంలో చాలా పల్లెటూర్లలో మహిళలు గుంపులుగా చేరి, ఒక చెట్టు కింద కూర్చొని చింత గింజలు వలుస్తూ కనిపిస్తారు. సాయంత్రం అయినా తర్వాత వలచిన గింజలను డబ్బాలో వేసుకొని, చెత్తలో పారవేస్తూ ఉంటారు.

ఇది సాధారణంగా చాలా గ్రామాలలో జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది ప్రజలు చింతపండు మాత్రమే ఉపయోగిస్తారు. చింతగింజలను వృధాగా పారవేయాలని అనుకుంటూ ఉంటారు. చింతపండు కంటే చింత గింజల్లోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చింతగింజలతో వివిధ ఆరోగ్య సమస్యలు నయం చేసుకోవచ్చు, వీటిని మందుల్లో తయారీకి కూడా ఉపయోగిస్తారు.

చింతగింజల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని, ఆరోగ్య నిపుణులు సూచి స్తున్నారు. చింత గింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు, అందుకోసం చింతగింజలని పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్ లా చేసి రోజు దంతాలను తోమాలిని దీంతో దంతాలు తెల్లగా మారడంతో, పాటు దంతాలకు ఉన్న గారపాచి దూరమైపోతుంది.

అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో చింత గింజల పొడిని నీళ్లల్లో కలిపి మరిగించి డికాషన్ల తయారు చేసుకోవాలి. దీనిని ఉదయం సాయంత్రం భోజనానికి ముందు ఒక కప్పు మాత్రమే తగిన మోతాదులో తీసుకోవాలి. దీనితో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి చింతగింజల పొడి డికాషన్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హై బీపీ కూడా తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది చింతగింజల్లో యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు పుండ్లపై రాయాలి, ఇలా చేస్తే అవి త్వరగా నయమైపోతాయి. చింతగింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మంపై ఉన్న మంగు మచ్చల నుండి ఉపశమనం కలిగిస్తాయి. చింతగింజలు పొడిగా తయారు చేసి ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతాలలో రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి. చింతగింజల పొడిని రోజు ఒక టీ స్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటిలో కలుపుకొని తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.